త్రికాల తెలుగు : భారత్ : పొగలు కక్కే పాత రైళ్ల నుంచి, పర్యావరణానికి మేలు చేసే ‘నమో గ్రీన్’ హైడ్రోజన్ రైళ్ల వరకు భారతీయ రైల్వేల సరికొత్త ప్రయాణం! వందే భారత్ వేగంతో, కాలుష్య రహితంగా మారుతున్న నవ భారతం ఇది. దేశ ప్రగతికి ప్రతీకగా పరుగులు తీస్తున్న భారతీయ రైల్వేల యుగమిది-BJP

దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత 10 బోగీల రైలును శుక్రవారం జూలై 17, 2026న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో 89 కి.మీ పరిధిలో ఈ రైలు నడుస్తుంది.

ఈ రైలు హైడ్రోజన్ ఇంధన సెల్స్ను వినియోగించుకుని పవర్ను సృష్టించుకుంటూ ముందుకు వెళ్తుంది. ఈ రైలు ప్రారంభంతో ప్రపంచంలో హైడ్రోజన్ రైళ్లు కలిగిన US, చైనా, జపాన్, జర్మనీ దేశాల సరసన భారత్ చేరింది.