అదృష్టం అంటే ఇదేనేమో! : మంత్రి పొంగులేటి
గ్రేటర్ హైదరాబాద్ : రాజేంద్రనగర్ మైలార్ దేవ్ పల్లిలోని ఓ చిన్నారి కుటుంబాన్ని అదృష్టం వరించింది. ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రాలో ఓ చిన్నారితో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టోకెన్ తీయించారు. అయితే ఆ టోకెన్ చిన్నారి కుటుంబం పేరు మీదే రావడం అక్కడున్న వారు ఆశ్చర్య పోయారు. ఈ విషయాన్ని మంత్రి Xలో షేర్ చేశారు. అదృష్టం అంటే ఇదేనని, ఆ చిన్నారి కుటుంబం సొంతింట్లో చల్లగా ఉండాలని దీవించినట్లు పేర్కొన్నారు.
*అదృష్టం అంటే ఇదేనేమో: మంత్రి పొంగులేటి
హైదరాబాద్ రాజేంద్ర నగర్ మైలార్ దేవ్ పల్లిలో చిన్నారి కుటుంబాన్ని అదృష్టం వరించింది. ఇందిరమ్మ ఇండ్ల లక్కీ డ్రాలో ఓ చిన్నారితో మంత్రి పొంగులేటి టోకెన్ తీయించారు ఆ టోకెన్ చిన్నారి కుటుంబం పేరు మీదే రావడంతో అక్కడున్న వారు ఆశ్చర్య పోయారు#news pic.twitter.com/wKdXIFBgyY— Trikala Telugu ( త్రికాల తెలుగు ) (@Thirunpeddedla) August 29, 2026
- ఘటన: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన లక్కీ డ్రా.
- ప్రాంతం: లక్ష్మీగూడ, మైలార్దేవపల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గం, హైదరాబాద్.
- జరిగింది ఏమిటి?: పారదర్శకంగా నిర్వహించిన ఈ డ్రాలో టోకెన్ తీయడానికి ఒక చిన్నారిని కోరగా, ఆ బాలుడు తీసిన టోకెన్ నంబర్ అతడి స్వంత కుటుంబానికే (జరపుల లక్ష్మి కుటుంబం) వచ్చింది.
- మంత్రి స్పందన: ఇది దేవుడి ఆశీర్వాదం అని, ఇలాంటి అరుదైన సంఘటన ఆశ్చర్యానికి, ఆనందానికి గురి చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆ బాలుడి కుటుంబాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలోనూ ఈ వీడియోను పంచుకున్నారు